రాజస్థాన్ లో ఎగిరేది కాషాయ జెండానే.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్
- బీజేపీకి 124 సీట్ల వరకు వచ్చే అవకాశం
- కాంగ్రెస్ కు 80 సీట్ల లోపే
- ఆ రెండు పార్టీల మధ్యే పోరు
200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించి ఈసీ ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో ఏ పార్టీ అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ నవభారత్ - ఈటీజీ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. సగటున ప్రతీ నియోజకవర్గంలో 105 మంది ఓటర్ల లెక్కన మొత్తం 21,136 మంది ఓటర్లను ప్రశ్నించింది. ఇందులో అధికార పార్టీ కేవలం 68 సీట్ల నుంచి 78 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 43.80 ఓట్ షేర్ తో 114 నుంచి 124 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది.