Shoaib Akhtar: ఆ అడ్డంకి దాటితే చాలు... కప్ టీమిండియాదే: షోయబ్ అక్తర్

Shoaib Akhtar talks about Team India performance in world cup
షార్ట్స్‌లో చూడండి
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై చిరస్మరణీయ విజయం సాధించడం తెలిసిందే. తొలుత పాకిస్థాన్ ను 191 పరుగులకు కట్టడి చేసి, ఆపై అద్భుతరీతిలో విజయలక్ష్యాన్ని అందుకుంది. తద్వారా తాజా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టును టీమిండియా అన్ని రంగాల్లో చిత్తు చేసిందని అన్నాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టిందని పేర్కొన్నాడు. టీమిండియా ముందు పాక్ ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని అక్తర్ విమర్శించాడు. పాక్ అంత  దారుణంగా ఓటమిపాలవడాన్ని తాను చూడలేకపోయానని తెలిపాడు. 

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా సరైన పంథాలో వెళుతోందని అన్నాడు. సెమీఫైనల్ అడ్డంకి దాటితే వరల్డ్ కప్ టీమిండియాదేనని అక్తర్ నమ్మకం వ్యక్తం చేశాడు. 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేయడం ఖాయంగా కనిపిస్తోందని వెల్లడించాడు.
Go Back to Shorts
Shoaib Akhtar
Team India
Pakistan
World Cup

More Telugu News