ఆ పాత్ర ఇచ్చినందుకు వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే: రేణూ దేశాయ్
- రవితేజ ప్రధానపాత్రలో టైగర్ నాగేశ్వరరావు చిత్రం
- అక్టోబరు 20న రిలీజ్
- టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలతా లవణంగా రేణూ దేశాయ్
- రేణూ దేశాయ్ లుక్ కు విశేష స్పందన
రేణూ దేశాయ్ ఈ చిత్రంలో... 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఇటీవల హేమలతా లవణంగా రేణూ దేశాయ్ లుక్ ను చిత్రబృందం విడుదల చేయగా, విశేషమైన స్పందన వచ్చింది.
దీనిపై రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు" అని పేర్కొన్నారు.