ఎన్డీయేలో చేరిన కుమారస్వామి.. కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్న నడ్డా
- అమిత్ షా, నడ్డాలతో కుమారస్వామి భేటీ
- ఎన్డీయేలో చేరినట్టు ప్రకటన
- పార్లమెంటు ఎన్నికలకు ముందు కర్ణాటకలో కీలక పరిణామం
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జేపీ నడ్డా స్పందిస్తూ... ఎన్డీయేలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషకరమని చెప్పారు. వారిని ఎన్డీయే కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోదీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.