సెప్టెంబరు 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- వచ్చే నెలలో 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- అమృతకాల ఘడియల్లో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడి
- ఇటీవలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
కాగా, జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11తో ముగిశాయి. మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి. అంతలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఎందుకున్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.