బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం
- ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూముకు ఈమెయిల్
- బాంబ్, డాగ్స్క్వాడ్తో తనిఖీలు
- ఉత్తదే అని తేల్చిన పోలీసులు
- గుర్తు తెలియని దుండగుడిపై కేసు
వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్తో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తి బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఆధారంగా గుర్తు తెలియని దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.