ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన భారత్
- ఫైనల్లో మలేసియాపై ఉత్కంఠ విజయం
- నాలుగోసారి ట్రోఫీ నెగ్గిన టీమిండియా
- టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు
హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (9 వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్ (45వ ని.), గుజ్రాంత్ సింగ్ (45వ ని.), ఆకాశ్ దీప్ సింగ్ (56వ ని.) తలో గోల్తో ఆతిథ్య జట్టును గెలిపించారు. మలేసియా తరఫున అజ్రాయి అబు కమల్ (14వ ని.), రహీమ్ రెజీ (18వ ని.), ముహమద్ అమినుద్దీన్ (28వ ని.) తలో గోల్ చేశారు. మూడో స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్ లో జపాన్ 5–3తో సౌత్ కొరియాను ఓడించింది. కాగా, ఆసియా చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 5 లక్షలను నజరానాగా అందిస్తున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.