సొంత కారు ఉంటే రేషన్ కార్డు రద్దు.. కర్ణాటక సర్కారు నిర్ణయం
- వైట్ బోర్డ్ కారుంటే బీపీఎల్ కార్డుకు అనర్హులని ప్రకటన
- ఉపాధి కోసం కొనుగోలు చేసిన వారికి మినహాయింపు
- సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు 10 కిలోల బియ్యం
రాష్ట్రంలోని బీపీఎల్ కార్డుదారులకు ప్రస్తుతం 5 కిలోల బియ్యం, మరో 5 కిలోలకు సంబంధించి నగదును అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ నుంచి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన బియ్యం కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి మునియప్ప వివరించారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.