వెస్టిండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్
- తొలి వన్డేలో 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్
- విండీస్ గడ్డపై అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా ఘనత
- గతంలో చాహల్ పేరిట ఉన్న రికార్డు
6 పరుగులకు 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా తన రిథమ్ ను మెరుగుపరుచుకోవడానికి తాను వర్కౌట్ చేశానని చెప్పాడు. గత ఏడాది కూడా తన రిథమ్ సరిగా లేదని... ఇప్పుడు గాడిలో పడిందని తెలిపాడు. మరోవైపు ఈరోజు ఇండియా, వెస్టిండీస్ ల మధ్య రెండో వన్డే జరగనుంది.