టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత
- ఈ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచిన శ్రీరమణ
- గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైనం
- 'మిథునం' సినిమాకు కథను అందించిన శ్రీరమణ
2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. 'పత్రిక' అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. కాలమిస్టుగా, కథకుడిగా, సినీ రంగంలో నిర్మాణ నిర్వహణ పరంగా ఆయన పేరుగాంచారు. ఇదే సమయంలో సాహిత్య, కళారంగాల్లో తనదైన సేవ చేశారు. శ్రీరమణది గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.