వరదలో కొట్టుకుపోయిన వంతెన.. వీడియో ఇదిగో !
హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘటన
ఉత్తరాదిలో భారీ వర్షాలకు పలు బ్రిడ్జిల ధ్వంసం
ఉప్పొంగుతున్న బియాస్ నది.. హైవేల మూసివేత
ఉత్తరాదిలో భారీ వర్షాలకు పలు బ్రిడ్జిల ధ్వంసం
ఉప్పొంగుతున్న బియాస్ నది.. హైవేల మూసివేత
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. బియాస్ నది వరదలతో తీరం కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మనాలిలో ఫ్లాష్ ప్లడ్స్ కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.