ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలకమైన యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
- జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు వర్షాకాల సమావేశాలు
- కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు జరిగే అవకాశం
- ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం
ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (యూసీసీ) ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును ప్రవేశ పెడితే పార్లమెంటు అట్టుడికిపోవడం ఖాయం. మరోవైపు ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్) బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.