రూ. 50 దొంగిలించాడన్న అనుమానం.. టోల్‌ప్లాజా గార్డును కొట్టిచంపేసిన వైనం.. వీడియో ఇదిగో!

Man Beaten To Death In Bihar Over Suspicion Of Theft Of Rs 50 Only
బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యక్తిని రూ. 50 దొంగిలించాడన్న అనుమానంతో కొందరు కొట్టి చంపారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్‌గా గుర్తించారు. నలుగురైదుగురు కలిసి అతడిని దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టోల్‌ప్లాజాలో దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానంతో దుండగుల మూక అతడిని తీవ్రంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్ ఆ తర్వాత తన సొంతూరికి వెళ్లాడు. ఆ వెంటనే మరణించాడు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు హర్యానాకు చెందిన బౌన్సర్లే ఈ దాడికి పాల్పడినట్టు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

కేసు నమోదు చేసుకున్న గోండా పోలీసులు నిందితుల కోసం టోల్‌ప్లాజాపై దాడిచేసినట్టు గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ తెలిపారు. దాడి తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది బాధితుడిని ట్రైన్‌లో సొంతూరికి పంపినట్టు పోలీసులు తెలిపారు. రైలులో ఆరోగ్యం క్షీణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్‌లో దింపేసిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
Go Back to Shorts
Bihar
Uttar Pradesh
Kulhadiya Toll Plaza
Arrah-Patna Highway

More Telugu News