నిరుద్యోగులకు శుభవార్త.. కేజీబీవీ, యూఆర్ఎస్లో 1,241 పోస్టులు
- నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
- ఈ నెల 26 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు
- కేజీబీవీల్లో మహిళా అభ్యర్థులే అర్హులు
అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://schooledu.telangana.gov.in లో ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇతర వివరాలు ఈ నెల 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు వచ్చే నెలలో ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నది.