బాత్రూమ్లో కలిసి స్నానం చేస్తూ, యువ జంట దుర్మరణం
- బెంగళూరులో వెలుగు చూసిన ఘటన
- శనివారం రాత్రి కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన యువ జంట
- గీజర్ లోంచి గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం
- కొద్దిసేపటికే దుర్మరణం
కాగా, శనివారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లిన వారిద్దరూ కిటికీ మూసేశారు. అయితే, వారు స్నానం చేస్తుండగా గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ అయ్యింది. దీంతో, స్పృహ తప్పి పడిపోయిన వారు ఆ తరువాత కాసేపటికి మృతి చెందారు. ఆదివారం ఆ జంట డ్యూటీకి రాకపోయేసరికి సహోద్యోగులు వారి ఇంటికి వెళ్లారు. ఎన్నిమార్లు తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్లో వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలకు పోస్ట్మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.