తెలంగాణలో బీజేపీ నాయకత్వ మార్పు? బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
- బీజేపీ రాష్ట్ర చీఫ్ గా డీకే అరుణ
- పార్టీ ప్రచార సారథిగా ఇప్పటికే ఈటెల రాజేందర్ నియామకం
- నేతలలో అసంతృప్తి నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలో మార్పులు చేసి, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని పటిష్ఠం చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర నేతలకు వరుసగా ఢిల్లీ నుంచి పిలుపులు అందుతున్నాయి. వరుసగా ఒక్కో నేత ఢిల్లీకి వెళ్లి వస్తుండడంతో రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పు జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటనకు ముందే తెలంగాణ బీజేపీలో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.