తిరుపతి- గుంటూరు ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల అరాచకం
- శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ
- కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- కిటికీల పక్కన ఉన్న మహిళా ప్రయాణికులే లక్ష్యం
పలువురు ప్రతిఘటించినప్పటికీ దొంగలు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఎంత మేర బంగారం దోపిడీకి గురైందన్న సమాచారం తెలియలేదు. ఈ దోపిడీపై ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఈ రైలుకు ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు భద్రత ఉంటుంది. దీంతో ఎర్రగుంట్ల రావడానికి ముందే దొంగలు దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.