హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. పెట్టుబడులకు ముందుకొచ్చిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్
- నగరంలో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న వార్నర్ బ్రదర్స్
- తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు
- ఏఎస్సీఈలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రసంగం
హైదరాబాద్లో వార్నర్ బ్రదర్స్ ఏర్పాటు చేసే ఐడీసీ సెంటర్ ద్వారా తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాగా, అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు జరగనున్న ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్లో పాల్గొనేందుకు కేటీఆర్ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై అక్కడ కేటీఆర్ ప్రసంగిస్తారు.