Sensex: వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 318 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 84 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.94 శాతం పెరిగిన టాటా మోటార్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐదు నెలల గరిష్ఠం వద్ద ఈరోజు ట్రేడింగ్ ను ముగించాయి. రియాల్టీ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 62,346కి ఎగబాకింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18,399 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.94%), టెక్ మహీంద్రా (1.93%), ఐటీసీ (1.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.45%), ఎల్ అండ్ టీ (1.14%). 

టాప్ లూజర్స్:
మారుతి (-1.00%), టీసీఎస్ (-0.63%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.15%), సన్ ఫార్మా (-0.06%), నెస్లే ఇండియా (-0.05%).
Sensex
Nifty
Stock Market

More Telugu News