భారత్పై అక్కసు వెళ్లబోసుకున్న చైనా
- త్వరలో జనాభాపరంగా చైనాను అధిగమించనున్న భారత్
- భారత్ నెం.1 స్థానం చేరుకోనుండటంపై స్పందించిన చైనా
- జనాభాలో నాణ్యత ఉండటం ముఖ్యమని కామెంట్
- తమ దేశంలో నైపుణ్యాలున్న కార్మికుల సంఖ్య 900 మిలియన్లు అని వెల్లడి
‘‘నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే..అధిక జనాభాతో ప్రయోజనం ప్రజల సంఖ్యపై ఆధారపడి ఉండదు. క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యం. మా దేశంలో 1.4 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య 900 మిలియన్లు. వీరందరి సగటు విద్యాభ్యాస సమయం 10.5 ఏళ్లు’’ అని వ్యాఖ్యానించారు. తద్వారా తమ దేశంలో నిపుణులైన కార్మిక వర్గం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.