Komatireddy Raj Gopal Reddy: నాకు ప్రాణ హాని ఉంది: హైకోర్టులో కోమటిరెడ్డి పిటిషన్

తన ప్రాణాలకు ముప్పు ఉందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేశారు. తనకు రక్షణ కల్పించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వాలని కోరారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి బీజేపీలో చేరారు. 

ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కాస్త నెమ్మదించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ప్రాణ హాని ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Komatireddy Raj Gopal Reddy
BJP
Life Threat

More Telugu News