కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలందరూ మళ్లీ జైలుకు రావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను కరోనా టైమ్ లో విడుదల చేసిన సుప్రీంకోర్టు
- అలా విడుదలైన వారంతా మళ్లీ జైలుకు రావాలని ఆదేశం
- కావాలంటే బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
కరోనా సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో మళ్లీ జైళ్లకు రావాలని ఆదేశించింది. జైలుకు వచ్చిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు.