Sapna Gill: బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే క్రికెటర్ పృథ్వీషాపై కేసు పెట్టిన సప్నా గిల్

Sapna Gill files case against cricketer Prithvi Shaw
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. పృథ్వీ షా (23), అతడి స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై సప్నా గిల్ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే ఆమె వారిపై కేసు పెట్టారు. 

పృథ్వీషా స్నేహితుడి కారును ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో సప్నా గిల్ సహా ఎనిమిది మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓ హోటల్‌లో పృథ్వీ భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునే విషయంలో సప్నా, పృథ్వీ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఆశిష్ కారుపై సప్నాగిల్, ఆమె స్నేహితులు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే, పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా ఆరోపిస్తున్నారు.
Go Back to Shorts
Sapna Gill
Prithvi Shaw
Team India
Mumbai Police

More Telugu News