నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 250 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 2.83 శాతం కోల్పోయిన ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 60,431కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 17,770 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (1.97%), ఎల్ అండ్ టీ (1.88%), ఎన్టీపీసీ (1.64%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.87%), సన్ ఫార్మా (0.78%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.83%), ఇన్ఫోసిస్ (-2.52%), టీసీఎస్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.47%), టెక్ మహీంద్రా (-1.43%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News