స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా ఏపీ మంత్రి రోజా
- సాయ్ లో ఐదు రాష్ట్రాల క్రీడల మంత్రులకు స్థానం
- దక్షిణ భారతదేశం నుంచి రోజాకు అవకాశం
- సంతోషం వ్యక్తం చేసిన రోజా
సాయ్ లో తనకు సభ్యత్వం లభించడంపై రోజా స్పందించారు. అరుదైన అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని పేర్కొన్నారు. రోజా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం లో క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు