పద్మశ్రీ వరించడంపై కీరవాణి స్పందన ఇదే
- భారత ప్రభుత్వం పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న కీరవాణి
- తల్లిదండ్రులు, గురువులకు వందనాలు తెలుపుతూ ట్వీట్
- ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న సంగీత దర్శకుడు
ఈ క్రమంలో ఆయనకు పద్మశ్రీ లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ పురస్కారంపై కీరవాణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు కవితాపు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా గురువులందరికీ గౌరవ వందనాలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.