10వ తరగతి విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచండి: హరీశ్ రావు
- పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగేలా చూడాలని తల్లిదండ్రులకు హరీశ్ సూచన
- పదో తరగతి 10 జీపీఏ సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ. 10 వేల బహుమానం ఇస్తానన్న మంత్రి
- 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ. 25 వేలు ఇస్తామని వ్యాఖ్య
10వ తరగతి ఉత్తీర్ణతలో తెలంగాణలో సిద్ధిపేట జిల్లా తొలి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా తొలి స్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పారు. పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్థులకు రూ. 10 వేల బహుమానం ఇస్తానని, 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ. 25 వేలు బహుమతిగా ఇస్తానని తెలిపారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టాలని హెడ్మాస్టర్లను మంత్రి ఆదేశించారు.