రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే కుట్ర జరుగుతోంది: కళా వెంకట్రావు

  • ఏపీలో దేవాలయాలపై దాడులు
  • దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక దాడులు జరుగుతున్నాయన్న కళా
ఏపీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. గత మూడున్నరేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే అందుకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 285 దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరిగాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఏ ఒక్క సంఘటనలోనూ దోషులను పట్టుకోలేదని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 

కాగా, కళా వెంకట్రావు నివాసంలో ఇవాళ నూతన సంవత్సరాది వేడుకలు జరిగాయి. కళా వెంకట్రావుకు పుష్పగుచ్ఛాలు అందించి పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.


More Telugu News

Kala Venkata Rao TDP YSRCP Andhra Pradesh