ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ... 300 దాటిన టీమిండియా స్కోరు
- 126 బంతుల్లో మెరుపు డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్
- 91 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీ
- భారత్ స్కోరు 37 ఓవర్లలో 314 పరుగులు
ఇషాన్ ఔట్ కావడంతో ఒక మెరుపు ఇన్నింగ్స్ కు తెరపడింది. మొత్తం 131 బంతులను ఎదుర్కొన్న ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులకు ఔట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ 91 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 37 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 314 పరుగులు. భారత్ దూకుడు చూస్తుంటే 450 పరుగులు సాధించే పరిస్థితి కనిపిస్తోంది.