బాసర ఆలయంలో అక్షరాభ్యాసం.. ఆన్ లైన్ లో టికెట్ల ధరలివి..!
- ఆన్ లైన్ లో టికెట్ ధర రూ.1,516.. విదేశీయులకు రూ.2,516
- అమ్మవారికి పూజ చేసిన వస్తువులను పోస్ట్ లో పంపించే ఏర్పాట్లు
- ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల వెల్లడి
ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో అక్షరాభ్యాసం టికెట్లను దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్షరాభ్యాసం కోసం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.1,516 చెల్లించాల్సి ఉంటుంది. ఇక విదేశీయులకు టికెట్ ధరను రూ.2,516 గా దేవాదాయ శాఖ నిర్ణయించింది. పోస్ట్ ద్వారా పూజ చేసిన వస్తువులను పంపించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్నవారికి కూడా పంపిస్తామని వివరించారు.