Tollywood: టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్.. ముదురుతున్న వివాదం!

- విజయ్ హీరోగా దిల్ రాజు చిత్రం
- సంక్రాంతికి తమిళ డబ్బింగ్ సినిమాలను విడుదల చేయొద్దన్న తెలుగు నిర్మాతల మండలి
- ఇలాగైతే తెలుగు చిత్రాలను తాము కూడా అడ్డుకుంటామన్న తమిళ దర్శకనిర్మాతలు
'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. తమిళ స్టార్ విజయ్ తో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో 'వారసుడు'గా, తమిళంలో 'వారిసు'గా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని... డబ్బింగ్ సినిమాలను విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది. ఈ లేఖపై తమిళ సినీ దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.