Tamilisai Soundararajan: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన పట్ల స్పందించిన గవర్నర్ తమిళిసై

Governor Tamilisai responds on Arvind issue
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి జరగడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది. 

కల్వకుంట్ల కవితను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్ లోని అర్వింద్ నివాసంపై దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు, అర్వింద్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Go Back to Shorts
Tamilisai Soundararajan
Governor
Arvind
BJP
TRS
Telangana

More Telugu News