Narendra Modi: ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించిన దుబ్బాక ఎమ్మెల్యే

  • హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ
  • బేగంపేటలో బీజేపీ స్వాగత సభ
  • మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టుగా ఓ చిత్రపటం
  • బహూకరించిన రఘునందన్
Dubbaka MLA Raghunandan Rao gifts a portrait to PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ నాయకత్వం మోదీ రాకను పురస్కరించుకుని బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించారు. ప్రధాని మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టు ఈ పటంలో చిత్రించారు. 

ఈ విశిష్ట కానుక అందుకున్న మోదీ ఎంతో సంతోషించారు. రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మునుగోడులో ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ బీజేపీ శ్రేణులను మోదీ అభినందించారు. నికార్సయిన పోరాటం కనబరిచారంటూ కొనియాడారు. మున్ముందు కూడా ఇదే తరహాలో పోరాడాలంటూ ప్రోత్సాహ వచనాలు పలికారు.

  • Loading...

More Telugu News