Adimulapu Suresh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్కు అరుదైన గౌరవం
ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు అరుదైన గౌరవం దక్కింది. విద్యార్థి దశలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయనకు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) ఫెలోగా పనిచేసే అవకాశం దక్కింది. ఈ మేరకు ఐఈటీఈ శనివారం సురేశ్ను తన ఫెలోగా గుర్తిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని తమ కేంద్రం పనుల్లో భాగస్వామ్యం కావాలని సురేశ్ను ఐఈటీఈ కోరింది.