ప్రజాశాంతి పార్టీలో చేరి షాకిచ్చిన గద్దర్
- మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా బరిలోకి
- రేపటి నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం
- ఆమరణ దీక్షను విరమించిన కేఏ పాల్
కాగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే గద్దర్ తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన పాటలు ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించాయి. అయితే, ఆ మధ్య ఆయన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకోని గద్దర్ ఈ మధ్య ఓటు వేశారు. అలాగే, హైదరాబాద్ లో జరిగిన నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే, గాంధీ భవన్ కు కూడా వెళ్లారు.