ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి

Indian foreign minister Jai Shankar questions US deal with Pakistan on F16 overhauling
  • పాకిస్థాన్ కు గతంలో ఎఫ్-16లు ఇచ్చిన అమెరికా
  • వాటి నిర్వహణ కోసం తాజాగా 450 మిలియన్ డాలర్ల ఒప్పందం
  • ఉగ్రవాదంపై పోరు కోసమేనని అమెరికా వెల్లడి
  • అమెరికా నిర్ణయాన్ని ఇప్పటికే తప్పుబట్టిన భారత్
పాకిస్థాన్ కు గతంలో తాము ఇచ్చిన ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం అమెరికా ఇటీవల కొత్త ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. 450 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్-16 విమానాల విడిభాగాలను సరఫరా చేయాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదంపై పోరు కోసమేనంటూ అమెరికా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

ఈ ఒప్పందంపై భారత్ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ మరోసారి ఘాటుగా స్పందించారు. అమెరికా-పాకిస్థాన్ సంబంధాల వెనకున్న ప్రాతిపదిక ఏమిటన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సంబంధాలు అమెరికా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లేవని జై శంకర్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో భారతీయ అమెరికన్ల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

"ఈ ఒప్పందం ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించినదని అంటున్నారు. యుద్ధ రంగంలో ఎఫ్-16 పోరాట విమానం సామర్థ్యాలు అందరికీ తెలుసు. కానీ, అలాంటి విమానాలను ఎక్కడ మోహరిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? ఉగ్రవాదంపై పోరు కోసమే ఎఫ్-16 యుద్ధ విమానాలు అని చెప్పి ఎవరినీ మోసం చేయలేరు. అమెరికా ప్రభుత్వ పెద్దలతో ఎవరితోనైనా నేను మాట్లాడడం జరిగితే... మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా అని కచ్చితంగా అడుగుతాను" అని జైశంకర్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
S.Jai Shankar
USA
Pakistan
F-16
India
Counter Terrorism

More Telugu News