అటార్నీ జనరల్ పదవి వద్దంటున్న సుప్రీం సీనియర్ న్యాయవాది
- కేంద్ర ప్రభుత్వ ఆఫర్ ను తిరస్కరించిన ముకుల్ రోహత్గీ
- ఈ నెల 30వ తేదీతో ముగియనున్న ప్రస్తుత అటార్నీ జనరల్ వేణుగోపాల్ పదవి
- పొడిగింపునకు నిరాకరిస్తున్న వేణుగోపాల్
పదవీకాలం పొడిగింపునకు వేణుగోపాల్ సుముఖంగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రోహత్గీకి కబురు చేసింది. కానీ, ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రోహత్గీకి ఇది వరకు అటార్నీ జనరల్ గా పని చేసిన అనుభవం ఉంది. 2014-2017 మధ్య మూడేళ్లు ఈ పదవిలో ఉన్నారు. అప్పుడు కూడా కొనసాగింపునకు ఇష్టపడకపోవడంతో ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్ ను ప్రభుత్వం అటార్నీ జనరల్ గా నియమించింది. వేణుగోపాల్ మూడేళ్ల కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి అటార్నీ జనరల్ ఎవరన్నదానిపై ఉత్కంఠ మొదలైంది.