రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... ఫలితం కూడా రేపే
- ఓటింగ్లో పాల్గొననున్న పార్లమెంటు ఉభయ సభల సభ్యులు
- ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీప్ ధన్కర్
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన మొత్తం 790 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉభయ సభల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రేపటి ఉపరాష్ట్రపతి పోలింగ్కు 788 మందికి మాత్రమే ఓటు హక్కు వుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.