పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ ఫైర్.. ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసన
- పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ
- అక్కడి నుంచి వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి ప్రణాళిక
- రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలను ముట్టడించనున్న కాంగ్రెస్ నేతలు
కాగా, జీఎస్టీ, నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తుతూ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వివిధ పార్టీలకు చెందిన 19 మంది రాజ్యసభ్యులు, నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యులును స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే, పార్లమెంటు బయట నిరసన తెలిపిన ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.