ఇంటికి రూ. 3,419 కోట్ల కరెంట్ బిల్లు.. షాక్ తో అస్వస్థతకు గురైన వ్యక్తి!

Gwalior family gets Rs 3419 Cr electricity bill
  • గ్వాలియర్ లో ఒక ఇంటికి షాకిచ్చిన విద్యుత్ శాఖ
  • బాధితుల ఫిర్యాదుతో పొరపాటును సరిదిద్దుకున్న అధికారులు
  • బాధితులకు రూ. 1,300 బిల్లు ఇచ్చిన వైనం
ఒక్కోసారి విద్యుత్ శాఖ చేసే పొరపాట్లు ఎంతో మందికి షాకిస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ కూడా ఓ కుటుంబానికి అలాగే షాకిచ్చింది. గ్వాలియర్ నగరంలోని శివ్ విహార్ కాలనీలో ఉన్న ఒక ఇంటికి ఏకంగా రూ. 3,419 కోట్ల బిల్లు వచ్చింది. ప్రియాంక గుప్తా పేరిట ఆ ఇల్లు ఉంది. 

ఈ బిల్లును చూసిన ఆమె మామ (భర్త తండ్రి) షాక్ కు గురై, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేల కోట్ల రూపాయల బిల్లును చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు. ఈ విషయాన్ని ప్రియాంక, సంజీవ్ లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పును సరిదిద్దుకున్న అధికారులు రూ. 3,419 కోట్ల బిల్లును వెనక్కి తీసుకుని, రూ. 1,300 వాస్తవ బిల్లును అందించారు.
Go Back to Shorts
Gwalior
Electricity bill
Rs 3419 Cr

More Telugu News