రాష్ట్రపతి భ‌వ‌న్‌కు వచ్చి, ముర్ముకు ప్ర‌ధాని అభినంద‌న‌... ఫొటో ఇదిగో

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం ఆయ‌న ఆమెతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ముర్ముకు ఇంతకుముందు ఢిల్లీలో ఓ బంగ్లాను కేటాయించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల్లో ముర్ము ఘ‌న విజ‌యం సాధించ‌డం, రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌డంతో ఆమె రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో సోమ‌వారం రాత్రే అడుగుపెట్టారు. 

Prime Minister
Narendra Modi
Draupadi Murmu
Rashtrapati Bhavan
President Of India

More Telugu News