టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ ఫైర్
- గుడివాడ మహానాడుకు తనను పిలవాలని సవాల్
- సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమని వెల్లడి
- జగన్ ను తిట్టడమే చంద్రబాబు పని అంటూ విమర్శలు
చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా చేసినా, గుర్తుండిపోయేలా ఒక్క పథకం కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చేశామని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. జిల్లాల పర్యటనలో సీఎం జగన్ ను తిట్టడమే చంద్రబాబు పని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక జోకర్ అయితే, అయ్యన్నపాత్రుడు తదితరులు బ్రోకర్లు అని జోగి రమేశ్ పేర్కొన్నారు.