పంచతంత్ర కథలు చిత్రం నుంచి 'నేనేమో మోతెవరి' పాట విడుదల

New song released from Panchatantra Kathalu
షార్ట్స్‌లో చూడండి
నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు నటిస్తున్న చిత్రం 'పంచతంత్ర కథలు'. ఈ చిత్రం నుంచి తాజాగా 'నేనేమో మోతెవరి... నువ్వేమో తోతాపరి' లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆవిష్కరించారు. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. 

ఐదు వేరు వేరు క‌థ‌ల‌ సమాహారం కావ‌డంతో ఈ మూవీకి `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు. నేనేమో మోతెవరి అంటూ సాగే పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా, ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి కూడా ఓ పాత్ర పోషించారు.
Go Back to Shorts
Panchatantra Kathalu
Nenemo Motevari
New Song

More Telugu News