Vallabhaneni Vamsi: వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

Vangaveeti Radha and Vallbhaneni Vamsi Met Each Other
షార్ట్స్‌లో చూడండి
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నిన్న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ పరస్పరం కరచాలనంతో పలకరించుకున్న అనంతరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. 

రాధాను దగ్గరుండి కారులో ఎక్కించిన వంశీ అనంతరం మాట్లాడుతూ.. రాధా తనకు మంచి మిత్రుడని, చాలా రోజుల తర్వాత కలవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నామని అన్నారు. కాగా, గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు-వంశీ మధ్య వివాదం నెలకొని.. పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న క్రమంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Go Back to Shorts
Vallabhaneni Vamsi
Vangaveeti Radha
Andhra Pradesh

More Telugu News