మంగళగిరిలో సెల్ ఫోన్ వెలుగులో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం... ఫొటోలు ఇవిగో!

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన
  • పర్యటన ముగించుకుని మంగళగిరి రాక
  • పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్
  • పవన్ మాట్లాడుతుండగా పవర్ కట్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్నారు. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. అయితే, పవన్ ప్రెస్ మీట్ కొనసాగుతుండగా, మధ్యలో కరెంటు పోయింది. దాంతో పవన్ సెల్ ఫోన్ వెలుగులోనూ మాట్లాడారు. అటు, మీడియా ప్రతినిధులు కూడా సెల్ ఫోన్లు ఆన్ చేసి ఆ కాంతిలోనే పవన్ చెప్పేది విన్నారు. కాగా ఈ చీకటి ప్రెస్ మీట్ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Pawan Kalyan
Press Meet
Cell Phones
Power Cut

More Telugu News