కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు
- కొన్ని ప్రాంతాల్లో మండిపోనున్న ఎండలు
- కనీసం మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం
- నిన్న మహబూబ్నగర్లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
దీని ప్రభావంతో నేడు అక్కడక్కడ వర్షాలు కురవనుండగా, నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మహబూబ్నగర్లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతుపవనాల కదలికలు మొదలవుతాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ తెలిపింది.