'అసని' ఎఫెక్ట్... ఏపీకి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- బంగాళాఖాతంలో అసని తుపాను
- తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని
- ఏపీ తీరానికి చేరువగా వస్తున్న వైనం
- సమీక్షించిన కేంద్ర హోంశాఖ
ఏపీ, ఒడిశాలో తుపాను పరిస్థితులపై ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి సమీక్షిస్తుండాలని కేంద్ర హోంశాఖ ఇతర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.
కాగా, అసని తీవ్ర తుపాను దిశ మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరం దాటనుందని ప్రైవేటు వాతావరణ సంస్థల తాజా నమూనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అనేకప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.