సీపీఎస్కు బదులుగా జీపీఎస్!.. నమ్మేలా లేదంటున్న ఏపీ ఉద్యోగులు!
- ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ చర్చలు
- జీపీఎస్ పేరిట కొత్త పెన్షన్ స్కీంను ప్రతిపాదించిన కమిటీ
- పాత పెన్షన్ స్కీమే కావాలన్న ఉద్యోగ సంఘాలు
- పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలని కోరినట్టు వెల్లడి
అయితే ఉద్యోగులు మాత్రం జీపీఎస్ పట్ల ఆసక్తి చూపలేదు. కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్ ఉద్యోగులు నమ్మేలా లేదని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ అమలుకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. తమకు కొత్త పెన్షన్ స్కీం అవసరం లేదని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులో పెట్టాలని తాము కోరినట్లు చెప్పారు.