శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న హింసపై రాహుల్ గాంధీ స్పందన
- నిన్న శ్రీరామనవమి నాడు నాలుగు రాష్ట్రాల్లో ఘర్షణలు
- గుజరాత్ లో ఒకరు మరణించినట్టు సమాచారం
- విద్వేషం, హింస విడనాడాలన్న రాహుల్
ఈ ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వంతో కూడిన పునాదులే దేశ పురోగతికి మార్గం వేస్తాయే తప్ప... విద్వేషం, హింసతో ఏమీ సాధించలేరని, పైగా ఆ రెండు అంశాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భిన్నరకాల సంస్కృతులకు నెలవైన సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.