50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన రాజస్థాన్ యువకుడు... ఎందుకంటే...!
- సికర్ నుంచి ఢిల్లీకి మారథాన్
- మీడియా దృష్టిని ఆకర్షించిన సురేశ్ భిచార్
- సైన్యంలో చేరాలన్నది అతడి ఆశయం
- రెండేళ్లుగా రిక్రూట్ మెంట్లు లేని వైనం
- వయసు దాటిపోతోందని ఆందోళన
24 ఏళ్ల ఆ యువకుడి పేరు సురేశ్ భిచార్. స్వస్థలం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా. భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలన్నది అతడి ఆశయం. రాజస్థాన్ లోని సికర్ నుంచి ఢిల్లీ చేరుకున్న అతడిని మీడియా పలకరించింది. తమ ప్రాంతంలో అనేకమంది సైన్యంలో చేరాలని తపిస్తుంటారని తెలిపాడు.
కానీ, రెండేళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవని, తమ ప్రాంతంలో అనేక మంది యువత వయసు దాటిపోతోందని ఆ యువకుడు వెల్లడించాడు. అయితే యువతలో సైన్యం పట్ల ఆసక్తి తరిగిపోకుండా ఉండేందుకు ఇలా మారథాన్ పరుగు చేపట్టినట్టు వివరించాడు.